T20 World Cup 2021 Final: Australia bag Rs 13 crore prize money, Team India earns same amount as Namibia and Scotland
#T20WorldCup2021
#AustraliaRs13croreprizemoney
#TeamIndiaprizemoney
#INDVSPAK
#Pakistan
#IPL2022
రెండు దశాబ్దాల పాటు వన్డే క్రికెట్ను ఏలిన ఆస్ట్రేలియా ఎట్టకేలకు టీ20 ఫార్మాట్లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. ఏమాత్రం అంచనాల్లేకుండా టీ20 ప్రపంచకప్ 2021లో అడుగుపెట్టిన ఫించ్ సేన.. నిలకడైన ఆట తీరుతో టైటిల్ కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్ 2021 మొత్తం ప్రైజ్మనీ 42 కోట్లు. మెగా టోర్నీలో పాల్గొన్న మొత్తం 16 జట్లకు ఆ అమౌంట్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పంపిణీ చేసింది. మెగా టోర్నీలో చాంపియన్గా నిలిచి ఆస్ట్రేలియాకు మొత్తం 13.1 కోట్ల ప్రైజ్మనీ దక్కింది. ఈ మొత్తంలో టోర్నీ గెలిచినందుకు 11.9 కోట్లు, 4 లీగ్ మ్యాచ్లు గెలిచినందుకు 1.2 కోట్లు ఆస్ట్రేలియాకు దక్కాయి. రన్నరప్ న్యూజిలాండ్కు 7.15 కోట్ల ప్రైజ్మనీ వచ్చింది. ఫైనల్లో చేరినందుకు 5.95 కోట్లు, సూపర్-12లో 4 మ్యాచ్లు గెలిచినందుకు కివీస్కు అదనంగా 1.2 కోట్లు దక్కాయి.